For Money

Business News

మరోసారి ముంచిన పేటీఎం

రెండోసారి పేటీఎం షేర్‌ ఇన్వెస్టర్లను ముంచింది. పబ్లిక్‌ ఆఫర్‌లో ఘోరంగా దెబ్బకొట్టిన పేటీఎం ఇవాళ భారీగా పతనమైంది. గత కొన్ని రోజులుగా బలహీనంగా ఉన్న ఈ షేర్‌ ఇవాళ మార్కెట్‌ స్థిరంగా ఉన్నా… 13 శాతంపైగా నష్టపోయింది. లిస్టింగ్‌ తరవాత వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా ఆఫర్‌ ధర నుంచి రూ.1271కి కుప్పకూలింది. కాని ఈ షేర్‌పై అధ్యయనం చేసి.. కొనే లోపలే మళ్ళీ కోలుకుంది. ఎంట్రీ ఛాన్స్‌ చాలా మంది మిస్సయ్యారు. ఈ షేర్‌ మళ్ళీ రూ.1,300 నుంచి రూ. 1,850కి చేరింది. ఆలస్యంగా ఈ కౌంటర్‌లో ఎంటర్‌ అయిన ఇన్వెస్టర్లు మళ్ళీ దెబ్బతిన్నారు.
ఇవాళ ఈ షేర్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి రావడంతో రూ. 1296ని తాకింది.
ఆల్‌ టైమ్‌ కనిష్ఠ ధర 1271. ప్రస్తుతం ఈ షేర్‌ రూ.1350 ప్రాంతంలో ట్రేడవుతోంది.