వన్ నేషన్.. వన్ గోల్డ్ రేట్
ప్రస్తుత బంగారం రేటు విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. నగరానికి ఒక రేటు. షాపునకు ఒక రేటు ఉంటోంది. ఎక్కడ ఎందుకు రేటు తక్కువగా ఉందో…ఎందుకు ఎక్కువగా ఉందో తెలియడం లేదు. ఈ పద్ధతి వల్ల కొనుగోలుదారులు భారీగా మోసపోతున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒకే రేటు ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇపుడు ఈ సమస్యకు పరిష్కారంగా వన్ నేషన్.. వన్ గోల్డ్ రేటు నినాదాన్ని ముందుకు తెచ్చింది జెమ్ అండ్ జువలరీ కౌన్సిల్ (జీజేసీ). దీనికి సంబంధించి వివిధ నగరాల్లోని బంగారం వర్తకులతో ఈ కౌన్సిల్ చర్చలు జరిపింది. దేశ వ్యాప్తంగా బంగారినికి ఒకే రేటు ఉండే విధంగా చొరవ చూపింది. ఈ కౌన్సిల్ ప్రయత్నం ఫలించినట్లు వార్తలు వస్తున్నాయి. కొనుగోలుదారుల ప్రయోజనం దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఒకే రేటు ఉంటే బాగుంటుందనే అభిప్రాయానికి షాపు యజమానులు కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వచ్చే నెలలో అంటే సెప్టెంబర్లో ఓ అధికారిక ప్రకటన రావొచ్చని ఈటీ నౌ ఛానల్ పేర్కొంది.