For Money

Business News

MID SESSION: భారీ లాభాల్లో కొనసాగుతున్న నిఫ్టి

యూరప్‌ ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండటంతో మన మార్కెట్లు దూసుకుపోతున్నాయి. నిఫ్టి ఎక్కడా తగ్గడం లేదు. ఉదయం 17706 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి 10.30 గంటలకు 17,674కు క్షీణించినా..వెంటనే వంద పాయింట్ల వరకు కోలుకుని 17768ని తాకింది. ప్రస్తుతం 17743 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బజాజ్‌ గ్రూప్‌ షేర్లన్నీ భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ ఏకంగా 5 శాతం లాభంతో ట్రేడవుతోంది. మిడ్‌ క్యాప్‌లో ఏయూ బ్యాంక్‌ 3 శాతం పెరిగింది. వొడా ఫోన్‌ 10 శాతంపైగా పెరిగి ఇపుడు రూ. 11.55 వద్ద 8 శాతం లాభంతో ట్రేడవుతోంది.