For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా మన ఈక్విటీ మార్కెట్‌ స్థిరంగా ప్రారంభమైంది. 17436 వద్ద ప్రారంభమైన నిఫ్టి 17498ని తాకింది. నిఫ్టి ప్రస్తుతం 17,484 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ కూడా 58661 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి కూడా 36350 పైన ట్రేడవుతోంది. బ్యాంక్‌ షేర్లలో మిశ్రమ ధోరణి కన్పిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, స్వల్ప నష్టంతో ఉండగగా, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ అర శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో ఎన్‌టీపీసీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. అలాగే పవర్‌ గ్రిడ్, కోల్‌ ఇండియా కూడా. ఇక నష్టాల్లో ఎస్‌బీఐ లైఫ్‌ ఉంది. ఈ షేర్‌ 2.41 శాతం నష్టంతో రూ. 1094 వద్ద ట్రేడవుతోంది. మిడ్‌క్యాప్‌ షేర్లలో ఐడియా టాప్‌లో ఉంది.