For Money

Business News

16275ని తాకిన నిఫ్టి

నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16275ని నిఫ్టి తాకింది. ప్రస్తుతం 16204 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 71 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టిట అన్ని ప్రధాన సూచీలకన్నా బలంగా ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా దాదాపు నాలుగు శాతం లాభపడి నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. అలాగే ఎల్‌ అండ్‌ టీ కూడా ఆకర్షణీయ లాభాలతో ఉంది. మెటల్స్‌లో స్వల్ప లాభాల స్వీకరణ కన్పిస్తోంది. క్రూడ్‌ ధరలు రాత్రి భారీగా పెరగడంతో ఏషియన్‌ పెయింట్స్‌ మళ్ళీ క్షీణించింది. నిఫ్టి 41 షేర్లు గ్రీన్‌లో ఉండటం విశేషం.నిఫ్టి నెక్ట్స్‌లో పెద్ద యాక్షన్‌ లేదు. అన్ని క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో కూడా సాధారణ లాభాలు ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ నిఫ్టి బ్యాంక్‌లో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఆరంభంలోనే నిఫ్టి ఒక మోస్తరు లాభాలను కోల్పోయింది. మరి ఇవాళ్టి గరిష్ఠ స్థాయిని నిఫ్టి తాకుతుందా అంటే…మిడ్‌ సెషన్‌ వరకు ఆగాలి.