For Money

Business News

గ్రీన్‌లో ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్వల్ప లాభంతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18,348 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 18335 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 27 పాయింట్లు పెరిగింది. రియల్‌ ఎస్టేట్‌, ఐటీ షేర్లు బాగా రాణిస్తున్నాయి. నిఫ్టిలో 35 షేర్లు లాభాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు ఒకే మోస్తరు లాభాలతో ట్రేడ్‌ కావడం విశేషం. నిన్న 20 శాతం పెరిగి మెట్రో బ్రాండ్స్‌ ఇవాళ మరో అయిదు శాతం లాభంతో ట్రేడవుతోంది. యూరప్‌ కంపెనీని కొనుగోలు చేసిన టెక్‌ మహీంద్రా ఇవాళ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. అద్భుత ఫలితాలు సాధించిన ప్రిస్టీజ్‌ ఎస్టేట్స్‌ కూడా 5 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. నిన్న భారీగా పెరిగిన ఆటో షేర్లు ఇవాళ చల్లబడ్డాయి. టాటాస్టీల్‌ బలహీనంగా ట్రేడవడం విశేషం.