17,700పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్లోనే 17723 స్థాయిని తాకిన నిఫ్టి ప్రస్తుతం 17694 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 117 పాయింట్లు లాభపడింది. నిఫ్టితో పాటు ఇతర అన్ని సూచీలు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి 0.67 శాతం లాభంతో ట్రేడువుతుండగా, బ్యాంక్ నిఫ్టి 1.25 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 41 షేర్లు లాభాల్లో ఉండగగా, 9 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఆటో షేర్లు వెలుగులో ఉన్నాయి. ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్గా నిలిచింది. చోళమండలం ఫైనాన్స్ షేర్ 4 శాతంపైగా క్షీణించగా, అశోక్ లేల్యాండ్ 3 శాతంపైగా లాభపడింది. ఇక మిడ్ క్యాప్ బ్యాంకింగ్ షేర్లలో ఆర్బీఎల్ బ్యాంక్ 2శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది.