For Money

Business News

2023… టాప్‌ పిక్‌ ఈ షేర్‌

ప్రముఖ షేర్‌ మార్కెట్‌ బ్రోకింగ్ కంపెనీమోతీలాల్‌ ఓస్వాల్‌ 2023 ఏడాదికి తమ టాప్‌ పిక్‌గా సంవర్ధన్‌ మదర్సన్‌ను ఎంపిక చేసింది. ఈ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా ఇన్వెస్టర్లకు ఈ సంస్థ సిఫారసు చేసింది. ఈ షేర్‌ ప్రస్తుతం రూ. 69.50 వద్ద ట్రేడవుతోంది. మొన్నటి దాకా చిప్స్‌ కొరత ఆటోమొబైల్‌ కంపెనీలకు పెద్ద సమస్యగా ఉండేది. ఇపుడు ఆ సమస్య తీరుతోందని మోతీలాల్‌ ఓస్వాల్ పేర్కొంది.అలాగే ఈ పరిశ్రమకు అత్యంత కీలకమైన ముడి పదార్థాల ధరలు కూడా బాగా తగ్గాయి. ఆటో కంపెనీలతో పాటు మదర్సన్‌ కంపెనీకి ఇది చాలా పాజిటివ్‌ అంశమని మోతీ లాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. మున్ముందు కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడే అవకాశముందని వెల్లడించింది. దీంతో ఈ షేర్‌ను కొనుగోలు చేసేందుకు ఈ బ్రోకరేజీ సంస్థ సిఫారసు చేసింది. వచ్చే ఏడాది ఈ షేర్‌ ధర రూ.95కు చేరే అవకాశముందని పేర్కొంది.