For Money

Business News

ఆ 5 కంపెనీల సీఈఓలతో మోడీ భేటీ

మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ అయిదు ప్రముఖ కంపెనీల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ల(సీఈఓలు)తో ఇవాళ భేటీ అవుతారు. ఈ కంపెనీలన్నీ భారత్‌లో ఇప్పటికే భారీ పెట్టుబడి పెట్టాయి. మరికొన్ని భారత్‌లో మున్ముందు పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. వాషింగ్టన్‌లో జరిగే ఈ భేటీకి రిలయన్స్‌తో జతకట్టిన క్వాల్కమ్‌, రిలయన్ష్‌ భారీ పెట్టుబడులు పెట్టనున్న రెన్యూవబుల్‌ ఎనర్జీ రంగానికి చెందిన ఫస్ట్‌ సోలార్‌, అడోబ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, ఎనర్జి సిస్టమ్స్‌, ఆయుధాల తయారీదారు అయిన జనరల్‌ అట్లాటిక్‌తో పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీబ్లాక్‌ స్టోన్‌ గ్రూప్‌ కంపెనీల సీఈఓలు హాజరు అవుతారని తెలుస్తోంది.