For Money

Business News

చేనేతపై పన్ను వేసిన ఏకైక ప్రధాని

స్వతంత్ర భార‌త‌దేశంలో చేనేత‌పై ప‌న్నువేసిన మొద‌టి ప్రధాని మోడీ అని మంత్రి కేటీఆర్ అన్నారు.క‌రోనా సంక్షోభంలోనూ టెక్స్‌టైల్‌రంగంపై మోదీ ప‌న్నుల భారం వేశార‌న్నారు. నేత‌న్నల సంక్షేమంపై బండి సంజ‌య్‌కి మంత్రి కేటీఆర్ ఇవాళ బ‌హిరంగ లేఖ రాశారు. మోడీ నిర్ణయాల‌వ‌ల్లే టెక్స్‌టైల్ రంగం దెబ్బతింటోందని కేటీఆర్ ఆవేద‌న వ్యక్తంచేశారు. చ‌రిత్రలో ఎన్నడూ లేనంత‌గా భారీగా టెక్స్‌టైల్ రంగానికి కేటాయింపులు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా యార్న్ స‌బ్సిడీ ఇస్తున్న రాష్ట్రం త‌మ‌దేన‌ని వెల్లడించారు. ప్రత్యేక పొదుపు ప‌థ‌కంతో నేత‌న్నకు చేయూత‌నిస్తున్నామ‌ని స్పష్టంచేశారు. నేత‌న్నల‌కు ఉన్న బీమాను ఎత్తివేసిన కేంద్రం నిర్ణయంపై బండి సంజ‌య్ మాట్లాడాల‌ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.