For Money

Business News

భారీ లాభాల్లో నిఫ్టి

ఉదయం నుంచి మార్కెట్‌ గ్రీన్‌లోనే కొనసాగుతోంది. ఆరంభంలో 17215 కనిష్ఠ స్థాయికి తాకిన నిఫ్టి ఆ తరవాత బలపడుతూ వచ్చింది. మిడ్‌ సెషన్‌లో మొదలైన యూరో మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. నిఫ్టి ప్రస్తుతం 17356 పాయింట్ల వద్ద 220 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. చాలా రోజుల తరవాత దిగువస్థాయిలో ఐటీ షేర్లకు మద్దతు లభిస్తోంది. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌లోకి వచ్చాయి. కోల్‌ ఇండియా టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఏషియన్‌ పెయింట్స్‌ కూడా టాప్‌ 5 గెయినర్స్‌లో నిలిచింది. బాటా కూడా లాభడింది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా అర శాతంపైగా లాభాల్లో ఉన్నాయి. రాత్రికి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది.