For Money

Business News

మెట్రో బ్రాండ్స్‌… ఐపీఓ ధర ఖరారు

మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ షేర్‌ ధర ఖరారైంది. షేర్లను రూ.485- 500ను ఆఫర్‌ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ఇష్యూ ఎల్లుండి అంటే 10న ప్రారంభమై 14న ముగియనుంది. ఈ ఇష్యూ సైజు రూ.1,368 కోట్లు. రూ.295 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేసి సమీకరిస్తారు. ప్రమోటర్లు, వాటాదార్లు తమ దగ్గరున్న షేర్లలో 2.14 కోట్ల షేర్లను ఈ ఆఫర్‌ కింద అమ్ముఆరు. ప్రస్తుతం ప్రమోటర్లకు కంపెనీలో 84 శాతం వాటా ఉండగా, 10 శాతాన్ని విక్రయించనున్నారు. 35 శాతాన్ని చిన్న మదుపర్లకు కేటాయించారు. ఇష్యూలో కనిష్ఠంగా 30 షేర్ల (ఒక లాట్‌)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సమీకరించిన నిధులను కంపెనీ విస్తరణ, ఇతర కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తారు.