For Money

Business News

సిద్దిపేటలో మలబార్‌ గోల్డ్‌ షోరూమ్‌

ప్రముఖ రిటైల్‌ జువెలరీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ తెలంగాణలో మరింతగా విస్తరిస్తోంది. సిద్దిపేటలో కంపెనీ ఈ నెల 13న కొత్త షోరూమ్‌ ప్రారంభిస్తున్నట్లు మలబార్‌ గ్రూపు చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌ చెప్పారు. ఈ ఒక్క నెలలో దేశ, విదేశాల్లో కొత్తగా 22 షోరూమ్‌లు ప్రారంభిస్తున్నామని… ఇందులో 10 షోరూమ్‌లు దేశంలో, 12 షోరూమ్‌లు పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ షోరూమ్‌ల విస్తరణ కోసం కంపెనీ రూ.800 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ ఏడాది 750 కొత్త షోరూమ్‌లు ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా నిర్ణయించింది.