For Money

Business News

KNR కన్‌స్ట్రక్షన్స్‌పై ఐటీ దాడులు

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ KNR కన్‌స్ట్రక్షన్‌పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఢిల్లీ, హైదారబాద్‌లోని కంపెనీ కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌, ములుగు, జనగాంతో పాటు ఆరు చోట్ల దాడులు జరుగుతున్నాయి. విలువైన డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాదాపు రూ. 3000 వార్షిక టర్నోవర్‌ ఉన్న కంపెనీ ఇది. దేశ వ్యాప్తంగా అనేక కీలక ప్రాజెక్టులను అమలు చేస్తోంది. స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన కంపెనీ ఇది. ఇవాళ ఈ కంపెనీ షేర్‌ రూ.286 వద్ద ముగిసింది.