For Money

Business News

దుమ్ము రేపిన ఐసీఐసీఐ బ్యాంక్‌

గతవారం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఆర్ధిక ఫలితాలను ఐసీఐసీఐ బ్యాంక్ షేర్‌కు ఇవాళ భారీ మద్దతు అందింది. ఉదయం స్వల్ప లాభంతో రూ. 798 వద్ద ప్రారంభమైన ఈ కౌంటర్‌లో భారీ కొనుగోళ్ళ మద్దతు ఇచ్చింది. గంటలోనే షేర్‌ 19 శాతం పెరిగి రూ.867కు చేరింది. ఇది 52 వారాల గరిష్టస్థాయి. ప్రస్తుతం ఈ షేర్‌ 11 శాతం లాభంతో రూ. 843 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి నష్టాల్లో ఉన్నా… ఐసీఐసీఐ బ్యాంక్కు గట్టి మద్దతు లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యు2లో ఐసిఐసిఐ బ్యాంక్ 5,511కోట్ల నికరలాభం ఆర్జించింది.