For Money

Business News

హెచ్‌ఏఎల్‌ షేర్ల విభజనకు ఓకే

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) షేరు ముఖ విలువ తగ్గనుంది. షేర్ల విభజనకు సంబంధించిన ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కంపెనీ షేర్‌ ముఖవిలువ రూ.10 కాగా, దీన్ని రూ.5 ముఖ విలువ గల రెండు షేర్లుగా విభజిస్తారు. షేర్ల విభజనకు సెప్టెంబరు 29 తేదీని రికార్డు తేదీగా నిర్ణయించింది. ఆ తేదీ వరకు షేర్లను కలిగి ఉన్న మదుపర్లు, విభజన నిష్పత్తి ప్రకారం కొత్త షేర్లను కేటాయిస్తారు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.15 ఫైనాల్‌ డివిడెండు చెల్లించేందుకు హెచ్‌ఎల్‌ఏ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.