For Money

Business News

గ్రాట్యుటీ పరిమితి 25 శాతం పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. రిటైర్‌మెంట్‌ గ్రాట్యుటీ పరిమితిని ఏకంగా 25 శాతం పెంచినట్లు కేంద్రం వెల్లడింది. ప్రస్తుతం రిటైర్‌మెంట్‌ గ్రాట్యుటీ గరిష్ఠ పరిమితి రూ. 20 లక్షలు ఉండగా, దీన్ని రూ. 25 లక్షలకు పెంచింది. అంటే 25 శాతం పెరిగిందన్నమాట. కొత్త పరిమితి ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపజేస్తున్నట్లు కేంద్రం వెల్లడి.
డీఏ 50 శాతానికి చేరడంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్‌ 30న తీసుకున్నా.. ప్రభుత్వం ఇపుడు ప్రకటించింది.