ఇవాళ మరో రూ. 2,200 జంప్

ఇవాళ ఢిల్లీలో పది గ్రాముల స్టాండర్డ్ బంగారం రూ. 98100ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇవాళ బంగారం రూ.1650 పెరిగినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే అపుడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3318 డాలర్లు మాత్రమే. డాలర్ మరింత బలహీనపడటంతో ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 3348 డాలర్లు పలుకుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇవాళ అమెరికా మార్కెట్లోబంగారం 3.32 శాతం పెరిగింది. మరోవైపు ఎంసీఎక్స్లో పది గ్రాముల బంగారం ధర రూ. 2,200 పెరిగింది. ఇపుడు జూన్ నెల కాంట్రాక్ట్ రూ. 95,659 వద్ద ట్రేడవుతోంది. చూస్తుంటే రేపు స్పాట్ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.