For Money

Business News

హైదరాబాదీ ‘రియల్‌’ కుబేరుడు

గృహ్‌ హురున్‌ ఇండియా జాబితాలో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఏఆర్‌ కార్పొరేషన్‌ అధిపతి జి అమరేందర్‌ రెడ్డి కుటుంబం టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకుంది. రూ.15,000 కోట్ల సంపదతో తొమ్మిదో స్థానంలో అమరేందర్‌ రెడ్డి ఉన్నారు. రన్‌వాల్‌ డెవలపర్స్‌ అధిపతి సుభాష్‌ రన్‌వాల్‌ కుటుంబం రూ. 11,400 కోట్ల సంపదతో పదో స్థానాన్ని పొందింది. దేశంలోని 14 నగరాల్లో 71 కంపెనీలకు చెందిన 100 మందితో ఈ 2021 సంవత్సరపు శ్రీమంతుల జాబితాను రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పలువురు రియల్‌ ఎస్టేట్‌ ఐశ్వర్యవంతులు లిస్ట్‌లో ఉన్నారు. గత ఏడాదితో పోలస్తే ఈ జాబితా నుంచి 13 మంది తప్పుకోగా, అంతేమంది కొత్త ఐశ్వర్యవంతులు చేరారు. అమరేందర్‌ రెడ్డి జాబితాలో కొత్తగా ప్రవేశించారు.