For Money

Business News

రాష్ట్రపతితో ఆర్థిక మంత్రి భేటీ

ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం ఆమె నార్త్‌ బ్లాక్‌ను చేరుకున్నారు. అక్కడిని ఆర్థిక శాఖ అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి భేటీ తరవాత ఆమె కేబినెట్‌ సమావేశానికి హాజరవుతారు. అక్కడే బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలుపుతుంది. తరవాత ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. నిర్మలా సీతారామన్‌ నాలుగోసారి బడ్జెట్‌ ప్రవేశపెడతారు.ఈ సారి ఆమె ట్యాబ్‌ నుంచి బడ్జెట్‌ చదువుతారు. బడ్జెట్‌ కోసం యాప్‌ను తయారు చేసిన కేంద్రం… లాంఛన ప్రాయంగా కొన్ని బడ్జెట్‌ కాపీలను పార్లమెంటుకు తెచ్చారు. అందరికీ ఎలక్ట్రానిక్‌ బడ్జెట్‌ కాపీలు ఇవ్వనున్నారు.