For Money

Business News

పతంజలి నుంచి అయిదు ఐపీఓలు?

పతంజలి గ్రూప్‌ అధినేత బాబా రామ్‌దేవ్‌ రేపు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. రానున్న అయిదేళ్ళలో గ్రూప్‌ భవిష్యత్‌ ప్రణాళికలను వివరించడంతో పాటు తమ గ్రూప్‌ నుంచి క్యాపిటల్‌ మార్కెట్‌లోకి ప్రవేశించే కంపెనీల గురించి కూడా ఆయన వివరించనున్నారు. ప్రస్తుతం పతంజలి గ్రూప్‌ నుంచి ఒక్క కంపెనీ మాత్రమే లిస్టయి ఉంది. పైగా పతంజలి నుంచి వచ్చిన ఐపీఓ కాదు. లిస్టయిన రుచి సోయా అనే కంపెనీని కొనుగోలు చేయగా … దానిని పతంజలి ఫుడ్స్‌ టేకోవర్‌ చేసింది. కాని గ్రూప్‌ నుంచి రానున్న అయిదు ఏళ్ళలో అయిదు పబ్లిక్‌ ఆఫర్లు వస్తాయని సమాచారం. వాటి వివరాలను కూడా రేపటి మీడియా సమావేశంలో బాబా రామ్‌దేవ్‌ బాబా వివరించే అవకాశముంది.ఈ ఏడాది మార్చి నెలాఖరుకు పతంజలి కంపెనీ రూ. 10,664 కోట్ల టర్నోవర్‌పై రూ. 740 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.