For Money

Business News

ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ టీడీపీ హవా…

ఇప్పటి వరకు వచ్చిన సర్వేలలో చాలా వరకు సర్వేలు టీడీపీ నేతృత్వంలోని కూటమి ఏపీలో విజయం సాధిస్తుందని తేల్చాయి. మరికాసేపట్లో ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా రానున్నాయి. ఇప్పటికే పలు మీడియా సంస్థలకు, ప్రముఖ జర్నలిస్టులకు ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు అందాయిల. ఇందులో కూడా టీడీపీ కూటమికి ఈ అధికార పగ్గాలు అందడం ఖాయంగా తెలుస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించిన జాతీయ సంస్థలతో పాటు తెలుగు మీడియా నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో అధిక భాగం టీడీపీకి అనుకూలంగా వస్తున్నాయి. చాలా వరకు సర్వే సంస్థలు, ఎగ్జిట్ పోల్స్‌ నిర్వహించిన సంస్థలకు వెనుక నుంచి రాజకీయ పార్టీల అండ ఉందనేది బహిరంగ రహస్యం. అయితే ఏ పార్టీవైపూ మొగ్గు చూపని… నిస్పక్షపాతంగా ఉండే సంస్థలు టీడీపీ విజయం ఖాయమని అంటున్నాయి. భజన మీడియా సంస్థలు భారీ నంబర్లు ఇస్తున్నా… వాటిని కూడా కొట్టిపారేయలేని పరిస్థితి ఇపుడు ఏపీలో నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే చాలా సర్వేలు 125కు పైగా స్థానాలు ఇస్తున్నాయి. ఈస్థాయి స్థానాలు రావాలంటే రాష్ట్రంలో సైలెంట్‌ వేవ్‌ వచ్చి ఉండాలి. అదే వస్తే టీడీపీ కూటమికి ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైకాపా అనుకూల సంస్థల నుంచి ఎగ్జిట్‌ పోల్స్‌ రానున్నాయి. ఆ సంస్థలు వైకాపాకు అదిక స్థానాలు ఇవ్వనున్నాయి. మరి ఆ సంస్థలు మొక్కబడి మెజారిటీ ఇస్తాయా? లేదా అధిక స్థానాలు ఇస్తాయా అన్నది చూడాలి.