For Money

Business News

డుకాటీ కొత్త బైకు ధర రూ.21 లక్షలు

ఇటలీకి చెందిన సూపర్‌ బైకుల తయారీ సంస్థ డుకాటీ..దేశీయ మార్కెట్లోకి కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్‌గా ‘పనిగేల్‌ వీ2’ మోటర్‌సైకిల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ధర రూ.21.30 లక్షలుగా నిర్ణయించింది. దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా లిమిటెడ్‌ ఎడిషన్‌గా ఈ బైకును ప్రవేశపెట్టింది. లిథియం-అయాన్‌ బ్యాటరీ, సింగిల్‌-సిట్‌ ఉండటంతో పాత మోడల్‌తో పోలిస్తే 3 కిలోలు తక్కువ బరువు, 955 సీసీ ట్విన్‌-సిలిండర్‌ ఇంజిన్‌ కలిగిన ఈ బైకు 155 హెచ్‌పీల శక్తితో నడుస్తుంది.