For Money

Business News

ప్రపంచ ‘టాప్‌100’ కుబేరుల్లో డీమార్ట్‌ యజమాని

స్టాక్‌ మార్కెట్‌లో షేర్ల ధరల పుణ్యమా అని కొత్త కొత్త కోటీశ్వరులు తయారవుతున్నారు. డీమార్ట్‌ కంపెనీ యజమాని రాధాకృష్ణన్‌ దమాని ఇపుడు ప్రపంచంలోని టాప్‌ 100 కుబేరుల్లో ఒకరుగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ఆయన సంపద 1,920 కోట్ల డాలర్లకు చేరింది. ఒక్క ఏడాదిలోనే ఆయన సంపద 430 కోట్ల డాలర్లు పెరిగింది. డీ మార్ట్‌ కంపెనీ మాతృసంస్థ అవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌ షేర్‌ ధర ఏడాదిలో 62 శాతం పెరిగింది. గత ఏడాది ఆయన ఇండియా సిమెంట్‌లో కూడా షేర్లు కొన్నారు. ఈ పెట్టుబడి విలువ కూడా ఏడాదిలో 47 శాతం పెరిగింది.