For Money

Business News

పేలిన కరోనా బాంబు

మెలమెల్లగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య ఇవాళ భారీగా పెరిగింది. శని, ఆదివారం సెలవు కావడంతో ఆది, సోమవారాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. సోమవారం పరీక్షల ఫలితాలు మంగళవారం వస్తాయి. దీంతో ఇవాళ దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. పెద్ద రాష్ట్రాలన్నీ ఇవాళ్టి కేసులను ప్రకటించగా, ఇంకా చిన్న రాష్ట్రాలు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు వెల్లడించిన కేసుల సంఖ్య 50,000 దాటింది. మృతుల సంఖ్య కూడా 500పైనే ఉంది. ఇవాళ ప్రధాన రాష్ట్రాలు ప్రకటించిన కరోనా కేసుల సంఖ్య ఇలా ఉంది…
మహారాష్ట్ర-18,448
పశ్చిమ బెంగాల్‌ -9,073
ఢిల్లీ -5481
కేరళ – 3610
కర్ణాటక -2479
తెలంగాణ- 1000
తమిళనాడు – 2,731
గుజరాత్‌ -2265
పంజాబ్‌ – 1027
బీహార్‌- 565
ఉత్తర ప్రదేశ్‌ – 992
ఆంధ్రప్రదేశ్‌ – 334