For Money

Business News

ఆటో షేర్లపై CLSA అప్‌డేట్‌

ఆటో రంగంపై ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తన తాజా అభిప్రాయాన్ని అప్‌డేట్‌ చేసింది. రెండు ప్రధాన షేర్ల ధరలను అప్‌డేట్‌ చేసింది. గతంలో బజాజ్‌ ఆటో, ఐషర్‌ మోటార్స్‌ను కొనుగోలు చేయాలని ఈ సంస్థ రెకమెండ్‌ చేసింది. అదే అభిప్రాయాన్ని కొనసాగిస్తూ ఈ రెండు షేర్ల టార్గెట్‌ను పెంచడం విశేషం. బజాజ్‌ టో షేర్‌ టార్గెట్‌ రూ. 4493 కాగా, ఇపుడు దీన్ని రూ 4774కు పెంచింది. అలాగే ఐషర్‌ మోటార్స్‌ ప్రస్తుత టార్గెట్ రూ. 3346 కాగా, దీన్ని రూ. 3618కి సీఎల్‌ఎస్‌ఏ పెంచింది. ఈ రెండు కంపెనీల మార్జిన్స్‌ బాగా పెరుగుతాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం, 2023-24లో 12 శాతం చొప్పున టూ వీలర్స్‌ అమ్మకాలు పెరుగుతాయని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ప్రస్తుతం ధరలు హిస్టారికల్‌ యావరేజ్‌ లెవల్స్‌కు దగ్గరగా ఉన్నాయని ఈ బ్రోకరేజ్‌ సంస్థ పేర్కొంది.