For Money

Business News

సీఎల్‌ఎస్‌ఏ టార్గెట్‌ రూ. 2025

దాదాపు రెండేళ్ళుగా స్తబ్దుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. గత త్రైమాసికంలో బ్యాంక్‌ పనితీరు అద్భుతంగా ఉన్నా… షేర్‌ ధరలు పెరుగుదల అంతంత మాత్రమే ఉంది. గత నెల చివరివారం నుంచి ఈ షేర్‌ పుంజుకోవడం ప్రారంభమైంది. ఇటీవల రూ. 1407కు పడిన బ్యాంక్‌ షేర్‌ కేవలం వారం రోజుల్లోనే రూ. 1507కు చేరింది. తాజాగా రీసెర్చి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ ఈ బ్యాంక్‌ రేటింగ్‌ను పెంచింది. ఈ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా ఇన్వెస్టర్లను సిఫారసు చేస్తోంది. ఈ షేర్‌ టార్గెట్‌ రూ., 2025గా పేర్కొంది. బ్యాంక్‌ పనితీరులో అద్భుత ప్రగతి కన్పిస్తోందని, నికర వడ్డీ ఆదాయం (Net Interet Income) ఈ త్రైమాసికంలో ఎలా ఉందో చూడాల్సి ఉంటుందని పేర్కొంది. ఒక త్రైమాసికం నుంచి మరో త్రైమాసికానికి బ్యాంక్‌ 8.4 శాతం వృద్ధి రేటు చూపించింది. అలాగే రీటైర్‌ రుణాల వృద్ధి రేటు కూడా అంచనాల మేరకు 5 శాతం ఉందని CLSA పేర్కొంది. కాసా (CASA) కూడా పది శాతం చొప్పున పెరుగుతూ పటిష్ఠంగా ఉందని తెలిపింది. ఈ కారణాల రీత్యా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని సిఫారసు చేసింది.