For Money

Business News

మాదాపూర్‌లో రూ.1200 కోట్లతో డేటాసెంటర్‌

హైదరాబాద్‌ క్రమంగా డేటా హబ్‌ సెంటర్‌గా మారుతోంది.తాజాగా క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్‌ కంపెనీ మాదాపూర్‌లోని ఐటీ కారిడార్‌లో రూ. 1,200 కోట్ల పెట్టుబ‌డులు పెట్టనున్నట్లు ప్రక‌టించింది. ఈ మేర‌కు తెలంగాణ ప్రభుత్వంతో క్యాపిటాల్యాండ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌, ఐటీ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ జ‌యేశ్ రంజ‌న్‌, క్యాపిట‌ల్యాండ్ ఇండియా ట్రస్ట్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ సంజీవ్ దాస్ గుప్తా, రియ‌ల్ అసెట్స్ సీఈవో పాట్రిక్ బూకాక్ పాల్గొన్నారు.డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు నగరంలోని ఐటీ కారిడార్‌లో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు క్యాపిట‌ల్యాండ్ తెలిపింది. 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం కలిగి ఉండే ఈ ఐటీపీహెచ్‌ డేటా సెంటర్‌ను 5 సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో తమకున్న సుమారు 6 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ విస్తీర్ణాన్ని రెట్టింపు చేయనుంది. రానున్న అయిదేళ్ళో మరో రూ. 5 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తంగా రూ.6,200 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది.