For Money

Business News

మేలో క్యాంపస్ యాక్టివ్‌ వేర్‌ ఐపీఓ

స్పోర్ట్స్, పాదరక్షల తయారీ సంస్థ క్యాంపస్ యాక్టివ్వేర్ వచ్చే నెలలో పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. దేశంలోని పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను పెంచడం ద్వరా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని కంపెనీ యోచిస్తోంది. మహిళలు , పిల్లల విభాగంలో కూడా కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా దాదాపు 100 ప్రత్యేక దుకాణాలు ఉన్నాయి . వీటిలో 65 స్టోర్లు కంపెనీకి చెందినవి కాగా మిగిలినవి ఫ్రాంచైజీ మోడల్‌లో నడుస్తున్నాయి. కంపెనీలో ఇపుడున్న ఇన్వెస్టర్లతో పాటు ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 5.1 కోట్ల షేర్లను జారీ చేయనుంది. ప్రమోటర్లయిన హరికృష్ణ అగర్వాల్, నిఖిల్ అగర్వాల్‌తో పాటు TPG గ్రోత్ -3 SF Pte లిమిటెడ్, QRG ఎంటర్‌ప్రైజెస్ కూడా తమ వాటాలో కొంత భాగాన్ని విక్రయించనున్నారు ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 78.21 శాతం వాటా ఉంది.