For Money

Business News

బ్రైట్‌కామ్‌ గ్రూపు చేతికి ‘మీడియామింట్‌’

డిజిటల్‌ కన్సల్టింగ్‌ సేవలు అందించే మీడియామింట్‌ మాతృ సంస్థను హైదరాబాద్‌కు చెందిన బ్రైట్‌కామ్‌ గ్రూపు టేకోవర్‌ చేసింది. మీడియా మింట్‌లో 1300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మీడియా మింట్‌ మాతృ సంస్థ వుచి మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100 శాతం వాటాను రూ.566 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు బ్రైట్‌కామ్‌ ప్రకటించింది. ఈ డీల్‌ కింద రూ.360 కోట్ల మొత్తాన్ని నగదులో చెల్లిస్తారు. మిగిలిన మొత్తంలో రూ.170 కోట్లకు సరిపడా బ్రైట్‌కామ్‌ గ్రూపు షేర్లు జారీ చేస్తారు. మిగిలిన రూ.36 కోట్లను 6 నెలల్లో చెల్లిస్తామని బ్రైట్‌ కామ్‌ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. మీడియా మింట్‌కు పింటరెస్ట్‌, న్యూయార్క్‌ టైమ్స్‌, నెట్‌ఫ్లిక్స్‌, కాక్స్‌ ఆటోమోటివ్‌, ఎక్స్‌పీడియా.. వంటి క్లయింట్లు ఉన్నారు.