మళ్ళీ క్రూడ్ మంటలు
ఇవాళ ఉదయం తగ్గినట్లే తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు ఇపుడు భారీగా పెరిగాయి. ఇవాళ జరగాల్సిన ఇరాన్, ఒమెన్ చర్చలు వాయిదా పడటంతో ధరలు ఏకంగా 3 శాతంపైగా పెరిగాయి ఇపుడు WTI క్రూడ్103 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ క్రూడ్ ధర 108 డాలర్ల సమీపంలో ఉంది డాలర్ ఇండెక్స్ 99పైన ఉంది. ఈ లెక్కన భారత్ వంటి వర్ధమాన దేశాలు భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాల కోరిక మేరకు ఇవాళ జరగాల్సిన సమావేశం వాయిదా వేసినట్లు ఒమన్ తెలిసింది. దీంతో హర్ముజ్ ద్వారా ఆయిల్ సరఫరాకు మళ్ళీ ఇబ్బందులు తలత్తే అవకాశముంది. మరో సౌదీ అరేబియా నౌకలపౌ హూతీలు దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ను ఆపేసినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది.
