For Money

Business News

టాప్‌ టెన్‌ కోసం అదానీ, అంబానీ పోటీ

ప్రపంచ కుబేరుల జాబితాలో పదోస్థానం కోసం భారత పారిశ్రామిక వేత్తలు రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ మధ్య గట్టి పోటీ నెలకొంది.రోజూ మ్యూజికల్‌ చెయిర్స్మా దిరిగా వీరి స్థానాలు మారుతున్నాయి. ఇద్దరి మధ్య తేడా తక్కువగా ఉండేసరికి రోజూ వీరి సంపద మారుతోంది. ముఖ్యంగా ఇవాళ అదానీ విల్మర్‌ లిస్ట్‌ కావడంతో అదానీ సంపద మరింత పెరిగింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ఎప్పటికపుడు వారి సంపదను అప్‌డేట్ చేస్తోంది. తాజా సమాచారం మేరకు గౌతమ్‌ అదానీ తాజా సంపద 8850 కోట్ల డాలర్లకు (రూ.6,63,750కోట్లు) చేరగా, ముకేష్‌ అంబానీ సంపద 8790 కోట్ల డాలర్లకు (రూ. 6,59,250 కోట్లు) చేరింది. ఈ విధంగా అదానీ ఆసియాలో నంబర్‌ వన్‌ కోటీశ్వరునిగా అవతరించారు.