For Money

Business News

మైండ్‌స్పేస్‌కు బ్లాక్‌స్టోన్‌ గుడ్‌బై

కె రహేజా గ్రూప్‌నకు చెందిన మైండ్‌స్పేస్‌ బిజినెస్ పార్క్స్ రీట్ ( రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ) నుంచి బ్లాక్‌స్టోన్‌ వైదొలగించింది. తనకున్న 9.2 శాతం వాటాను విక్రయించింది. హైదరాబాద్‌తో పాటు మరో మూడు నగరాల్లో మైండ్‌స్పేస్‌కు బిజినెస్‌ పార్కులు ఉన్న విషయం తెలిసిందే. బ్లాక్‌స్టోన్‌ వాటాను ప్లాటినం ఇల్యూమినేషన్ ట్రస్ట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 5.43 కోట్ల యూనిట్లను సగటున రూ. 320 చొప్పున కొనుగోలు చేసినందున, ఈ లావాదేవీ విలువ రూ.1740 కోట్లుగా లెక్కిస్తున్నారు. మైండ్‌స్పేస్‌ బిజినెస్ పార్క్ సంస్థలో కొంతకాలం క్రితం బ్లాక్‌స్టోన్‌ 15 % వాటా కొనుగోలు చేసింది. మైండ్‌స్పేస్‌ రీట్ గత ఏడాదిలో దేశీయ స్టాక్ఎక్స్ఛేంజీల్లో నమోదైంది. అప్పుడు కొంత వాటాను విక్రయించిన బ్లాక్లోన్ ఇపుడు మిగిలిన 9.2 శాతం వాటాను విక్రయించింది.