For Money

Business News

ఐపీఓ నేటితో ముగుస్తోంది… దరఖాస్తు చేశారా?

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్ షో రూమ్‌లను నిర్వహించే ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా పబ్లిక్‌ ఆఫర్‌ నేటితో ముగియనుంది. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ. 500 కోట్లను కంపెనీ సమీకరించనుంది. ఈనెల 4వ తేదీన ప్రారంభమైన ఈ పబ్లిక్‌ ఆఫర్‌కు ఆదరణ బాగానే ఉంది. రెండో రోజు ముగిసే సమయానికి పబ్లిక్ ఆఫర్‌కు 2.47 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. ఇందులో రీలైట్‌ ఇన్వెస్టర్ల విభాగం మూడు రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయింది. గడువు ఇవాళ ముగుస్తున్నందున… ఇవాళ భారీ స్పందన రావొచ్చు. గ్రేమార్కెట్‌లో ఈషేర్‌కు అధిక ప్రీమియం పలుకుతోంది. దీంతో ఇన్వెస్టర్లు దరఖాస్తున్నారు. ఈనెల 17న ఈ షేర్లు లిస్టవుతాయి. చాలా మంది అనలిస్టులు, బ్రోకింగ్‌ సంస్థలు ఈ ఇష్యూకు దరఖాస్తు చేయమనే సలహా ఇస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా స్టోర్లు ఉన్న ఈ కంపెనీ మంచి పనితీరు కనబరుస్తోంది. ఈ ఇష్యూకు లిస్టింగ్‌ లాభాలు బాగానే వచ్చేలా ఉంది. ఈ షేర్లను గరిష్ఠంగా రూ.59 ధరకు ఆఫర్‌ చేస్తున్నారు. అనధికార మార్కెట్‌లో ప్రీమియం రూ.30 ప్రాంతంలో ఉంది.