For Money

Business News

39 శాతం పెరిగిన లాభం

హైదరాబాద్‌కు చెందిన అమర రాజా బ్యాటరీస్‌ కంపెనీ సెప్టెంబర్‌తో ముగిసిన మూడునెల్లో రూ. 2700 కోట్ల టర్నోవర్‌పై రూ.201 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 39 శాతం, టర్నోవర్‌ 19 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో కంపెనీ రూ. 2264 కోట్ల టర్నోవర్‌పై రూ.144 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ మార్జిన్‌ కూడా 11.89 శాతం నుంచి 13.28 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది.