For Money

Business News

7 నుంచి ఆకాశ ఎయిర్‌ సర్వీసులు

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ నెలకొల్పిన ఆకాశ ఎయిర్‌ విమానయాన సంస్థ వచ్చే నెల 7వ తేదీ నుంచి తన సర్వీసులను ప్రారంభించనుంది. తొలి సర్వీసు ముంబై నుంచి అహ్మదాబాద్‌ మధ్య నడపనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. వచ్చే 13వ తేదీ నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య సర్వీసు నడుపుతామని తెలిపింది. రెండో బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలతో ఆకాశ ఎయిర్‌ సర్వీసులను ప్రారంభించనుంది. ఇందులో విమానం ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. మరో విమానం నెలాఖరులో రానుందని కంపెనీ తెలిపింది. వారానికి 28 సర్వీసులు నడపున్నట్లు పేర్కొంది.