For Money

Business News

19న సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల నోటీసు

త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్కరించాల‌ని కోరుతూ అఖిల భార‌త బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ఈనెల 19న దేశ‌వ్యాప్త స‌మ్మెకు పిలుపునిచ్చింది. సాధార‌ణంగా ప్రతి నెలా తొలి, మూడో శ‌నివారం బ్యాంకులు తెరిచే ఉంటాయి. రెండో, నాలుగో శ‌నివారం బ్యాంకుల‌కు సెల‌వు. మూడో శనివారం రోజున సమ్మెకు పిలుపు ఇచ్చారు. దీంతో రెండు రోజులు బ్యాంకులు పని చేయవన్నమాట. సమ్మెకు సంబంధించిన నోటీసును ఇండియ‌న్ బ్యాంక్స్ అసోసియేష‌న్ (ఐబీఏ)కు ఇచ్చినట్లు అఖిల భార‌త బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యద‌ర్శి సీహెచ్ వెంక‌టాచ‌లం నోటీసు ఇచ్చారు.