For Money

Business News

27న అదానీ విల్మర్‌ ఐపీఓ

అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ విల్మర్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 27వ తేదీన ప్రారంభం కానుంది.ఈ ఆఫర్‌ ద్వారా రూ. 3600 కోట్లను సమీకరించనుంది. కంపెనీ ఫార్చ్యూన్‌ బ్రాండ్‌తో వివిధ రకాల ఆయిల్స్‌ను ఈ కంపెనీ అమ్ముతోంది. వాస్తవానికి ఈ కంపెనీ మార్కెట్‌ నుంచి రూ. 4500 కోట్ల వసూలు చేయాలని ప్రతిపాదించింది. తరవాత ఇష్యూ సైజ్‌ తగ్గించుకుంది. ఈ కంపెనీలో అదానీకి 50 శాతం, సింగపూర్‌కు చెందిన విల్మర్‌ గ్రూప్‌కు 50 శాతం వాటా ఉంది. ఇష్యూ ధర రూ. 218- రూ. 230. ఇష్యూ నిధుల్లో రూ. 1900 కోట్లను మూలధన వ్యయం కోసం, రూ. 1100 కోట్లు రుణాల చెల్లింపు కోసం వెచ్చిస్తారు. మిగిలిన రూ. 500 కోట్ల కొత్త కంపెనీల టేకోవర్‌ కోసం వినియోగిస్తారు.