సియంట్, HULలపై బ్రోకరేజ్ రిపోర్ట్లు
హైదరాబాద్కు చెందిన సియంట్ కంపెనీ షేర్ను నెగిటివ్ రిపోర్ట్ ఇస్తోంది మోర్గాన్ స్టాన్లీ. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో సియంట్ కంపెనీ రెవెన్యూ పరంగా విఫలమైందని పేర్కొంది. మార్జిన్స్ కూడా మున్ముందు కొనసాగడం కష్టమని చెప్పిన మోర్గాన్ స్టాన్లీ.. ఈ షేర్ను రూ. 900 టార్గెట్ కోసం సెల్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ షేర్ రూ.976 వద్ద ట్రేడవుతోంది.
హిందుస్థాన్ లీవర్ షేర్కు సంబంధించి దాదాపు అన్ని బ్రోకరేజీ సంస్థలు బై సిగ్నల్ ఇచ్చాయి. ఈ షేర్ ప్రస్తుతం రూ. 2262 వద్ద ట్రేడవుతోంది. జెఫెరీస్ టార్గెట్ రూ. 2900. సీఎల్ఎస్ఏ కూడా ఈ షేర్ను ఔట్పెర్ఫామ్ రేటింగ్ను కొనసాగిస్తోంది. ఈ సంస్థ మాత్రం షేర్ టార్గెట్ను రూ. 2725గా పేర్కొంది. సీఎస్ కూడా ఇదే తరహా టార్గెట్ను ఇచ్చింది. ఈ సంస్థ లెక్క ప్రకారం ఈ షేర్ రూ.2800లకు చేరనుంది. మోర్గాన్ స్టాన్లీ కూడా ఈ షేర్ టార్గెట్ను రూ. 2766గా పేర్కొంది.