For Money

Business News

అదానీ గ్రీన్‌ చేతికి ఎస్‌బీ ఎనర్జీ

ఎస్‌బీ ఎనర్జీ ఇండియాను 350 కోట్ల డాలర్ల (దాదాపు రూ.26,000 కోట్లు)తో అదానీ గ్రీన్‌ ఎనర్జీ (ఏజీఈఎల్‌) కొనుగోలు చేసింది. మొత్తం నగదు రూపంలో జరిగిన ఈ డీల్‌ పూర్తయినట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. ఈ ఒప్పందం మే 18, 2021న కుదిరిన విషయం తెలిసిందే. ఈ లావాదేవీతో ఎస్‌బీ ఎనర్జీ ఇండియా ఇపుడు ఏజీఈఎల్‌కు 100% అనుబంధ సంస్థగా మారింది. సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ కార్ప్‌, భారతీ గ్రూప్‌లు 80:20 నిష్పత్తిలో ఎస్‌బీ ఎనర్జీని ఏర్పాటు చేశాయి. ఎస్‌బీ ఎనర్జీకి దేశవ్యాప్తంగా 5 గిగావాట్ల పునరుత్పాదక ఆస్తులున్నాయి.