For Money

Business News

మదర్సన్‌ సుమి వైరింగ్‌ షేర్ల లిస్టింగ్‌

మదర్సన్‌ సుమి వైరింగ్‌ ఇండియా కంపెనీ షేర్లు ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ అయ్యారు.ఈ రోజు బీఎస్‌ఈలో ఈ షేర్‌ రూ. 66 వద్ద లిస్టయింది. వెంటనే 5 శాతం పెరిగి ర.69.30కి చేరింది. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 62.25 వద్ద ట్రేడవుతోంది. మదర్సన్‌ సుమీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ఆటోమొబైల్‌, దేశీయ వైరింగ్‌ హార్నెస్‌ బిజినెస్‌ను మరో కంపెనీగా విడగొట్టిన విషయం తెలిసిందే. మదర్సన్ సుమి సిస్టమ్స్‌ షేర్‌ ఇవాళ స్థిరంగా ట్రేడవుతోంది. ఇవాళ లిస్టయిన షేర్‌ పది రోజుల పాటు ట్రేడ్‌ టు ట్రేడ్‌ గ్రూప్‌లో కొనసాగుతుంది. తరవాత ఆ గ్రేప్‌ నుంచి మారుస్తారు.