For Money

Business News

బైక్‌వోలో వెంకటేష్‌ పెట్టుబడి

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్, సర్వీసింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసే సంస్థ బైక్‌వో కంపెనీలో సినీ నటుడు వెంకటేష్‌ పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీకి ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా ఉంటారని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ విద్యాసాగర్‌ రెడ్డి తెలిపారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా 20 వేల ఈవీ ఛార్జింగ్, సర్వీసింగ్‌ పాయింట్లను నెలకొల్పాలన్నది తమ లక్ష్యమని కంపెనీ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. వెంకటేష్‌ ఏ మేరకు పెట్టుబడి పెట్టింది కంపెనీ వెల్లడించలేదు. డీలర్‌షిప్‌లను ఇవ్వడంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు బైక్‌వో తెలిపింది.