For Money

Business News

గోద్రేజ్ ప్రాపర్టీస్… కొత్త గరిష్టానికి షేర్లు

గత కొన్ని నెలలుగా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల షేర్లు పెరుగుతున్నాయి. ఇతర కంపెనీలక్నా గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు ఇటీవల భారీగా పెరిగాయి. మార్కెట్‌ నష్టాల్లో ఉన్నా రియల్‌ ఎస్టేట్‌ షేర్లకు మద్దతు కొనసాగుతోంది. దీంతో గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ షేర్‌ ఇవాళ కొత్త గరిష్టానికి చేరింది. ముంబైలోని వడాలాలో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తామని కంపెనీ వెల్లడించడంతో కంపెనీ షేర్లు బీఎస్ఈలో ఇంట్రా డే ట్రేడ్‌లో 8 శాతం పెరిగి రూ. 2,410ని తాకింది. ఆ తరవాత రూ. 4 శాతం లాభంతో రూ. 2315 వద్ద షేర్‌ ముగిసింది. గడిచిన ఒక నెలలో గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్‌ 64 శాతం పెరిగడం విశేషం.