For Money

Business News

బోనస్‌ షేర్లకు ఓకే

బోనస్‌ షేర్ల జారీకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వాటాదారుల దగ్గర ఉన్న ప్రతి ఒక షేర్‌కు మరో షేర్‌ను బోనస్‌గా ఇవ్వాలని రిలయన్స్‌ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఈ ఓటింగ్ పద్ధతి ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా కంపెనీ వాటాదారులను కోరింది. ఈ ఓటింగ్‌ గత నెల16న ప్రారంభమై.. ఈనెల 15న ముగిసింది. ఈ ఓటింగ్ వివరాలను కంపెనీ ఇవాళ వెల్లడించింది. బోనస్‌ షేర్ల జారీకి అర్హమైన ఓట్లలో 99.92 శాతం మంది వాటాదారులు ఆమోదం తెలిపారు.

Leave a Reply