For Money

Business News

రేపు ఆఫర్‌ ఫర్‌ సేల్‌

మార్కెట్‌ ఊహించినట్లే కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ రేపు అంటే బుధవారం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ చేపట్టనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా ఒక్కో షేర్‌ను రూ. 1540లకు అందించనుంది. కంపెనీలో 2.5 శాతం వాటాను అంటే 66 లక్షల షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తే మరో 2.5 శాతం ఈక్విటీని కూడా విక్రయించాలని కంపనీ నిర్ణయించింది. రీటైల్‌ ఇన్వెస్టర్లతో పాటు నాన్‌ రీటైల్‌ ఇన్వెస్టర్లకు కూడా రేపు ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. అయితే నాన్‌ రీటైల్‌ కేటగిరి ఇన్వెస్టర్ల కోసం ఆఫర్‌ చేసే ధరను ప్రత్యేకంగా ప్రకటించనుంది. ఈ కంపెనీ షేర్లు ఇవాళ మార్కెట్‌లో రూ. 1673 వద్ద ముగిశాయి. అంటే మూడు శాతం డిస్కౌంట్‌తో షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈ ఏడాదిలో ఈ షేర్‌ 145 శాతం పెరిగింది.అయితే ఈ షేర్‌ జులైలో నెలలో రూ.3000లను కూడా తాకింది. అక్కడి నుంచి దాదాపు సగానికి తగ్గింది. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 44,000 కోట్లు.

Leave a Reply