For Money

Business News

ఎస్‌బ్యాంక్‌పై జపాన్‌ కంపెనీ ఆసక్తి

ఎస్‌ బ్యాంక్‌లో మెజారిటీ వాటా కోసం జపాన్‌కు చెందిన ఓ కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జపాన్‌కు చెందిన మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్‌ గ్రూప్‌ ఇపుడు ఎస్‌ బ్యాంక్‌లో మెజారిటీ వాటా కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ప్రపంచంలోనే అతి పెద్ద రెండవ బ్యాంక్‌ హోల్డింగ్‌ కంపెనీ ఇది. ఈ కంపెనీ ఇది వరకే హెచ్‌డీబీ ఫైనాన్స్‌లో పెట్టుబడి కోసం ప్రయత్నించింది. ఏకంగా 200 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రతిపాదించింది. అయితే హెచ్‌డీబీ మాతృసంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జపాన్‌ కంపెనీ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో ఎస్‌బ్యాంక్‌లో వాటా కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply