For Money

Business News

ఐటీలో మోతీలాల్‌ టాప్‌ పిక్‌

త్వరలోనే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గనున్న నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్ల దృష్టి ఐటీ షేర్లపై పడింది. వడ్డీ రేట్లు తగ్గితే బాగా లాభపడే రంగాల్లో ఐటీ, టెక్‌ ఒకటి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లలో బాగా లాభపడేందుకు అవకాశం ఉన్న షేర్లను ప్రముఖ బ్రోకరేజి సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ విడుదల చేసింది. ఇందులో నాలుగు షేర్లను, వాటి టార్గెట్‌లను పేర్కొంది.
హెచ్‌సీఎల్‌టెక్‌ రూ.2,200
ఎల్‌టీఐ మైండ్‌ట్రీ రూ.7,400
పర్సిటెంట్‌ రూ. 6,300
కోఫోర్జ్‌ రూ. 8,100

ఈ నాలుగు షేర్లలో టాప్‌పిక్‌గా హెచ్‌సీఎల్‌టెక్‌ షేరును పేర్కొంది. హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్రస్తుత ధర రూ. 1779

(సమాచారం కోసం ఈ వార్తను ఇచ్చే ప్రయత్నమిది. షేర్లలో పెట్టుబడి పెట్టే ముందు మీ పర్సనల్‌ ఫైనాన్షియల్‌ అడ్వియిజర్‌ సలహా తీసుకోవడం మర్చిపోవద్దు)

Leave a Reply