For Money

Business News

బోనస్‌ షేర్లకు బోర్డు ఆమోదం

తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు జారీ చేయాలన్న ప్రతిపాదనకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు ఇవాళ ఆమోదం తెలిపింది. వాటాదారుల వద్ద ఉన్న ప్రతి ఒక షేరు మరో షేర్‌ను బోనస్‌గా ఇవ్వాలని ఇటీవల జరిగిన కంపెనీ ఏజీఎంలో ప్రతిపాదన వచ్చిన విషయం తెలిసిందే. ఏజీఎం ఆమోదం తరవాత ఇవాళ బోర్డు అధికారిక ముద్ర వేసింది. బోనస్‌ షేర్లతో కంపెనీ ఈక్విటీ రెట్టింపై రూ. 50,000 కోట్లకు చేరుతుంది. అర్హులైన వాటాదారులను ఖరారు చేసే రికార్డు తేదీని త్వరలోనే ప్రకటిస్తామని రిలయన్స్‌ కంపెనీ పేర్కొంది.