For Money

Business News

ఐపీఓకు అయిదు ఫార్మా కంపెనీలు రెడీ

రాబోయే కొద్ది వారాల్లో తొలి పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)కు అయిదు ఫార్మా కంపెనీలు రెడీ ఉన్నాయి. ఇవి రూ.8,000 కోట్లకు పైగా నిధులను సమీకరించనున్నాయి. వీటిల్లో ప్రధాన ఆఫర్‌ బెయిన్‌ క్యాపిటల్‌కు చెందిన ఎంక్యూర్‌ ఫార్మా. ఈ కంపెనీ రూ.4,000 కోట్ల వరకు సమీకరించనుంది. విజయా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌(రూ.1500 కోట్లు), కృష్ణ డయాగ్నోస్టిక్స్‌(రూ.1200 కోట్లు), సుప్రియ లైఫ్‌ సైన్సెస్‌(రూ.1200 కోట్లు), విండ్‌లాస్‌ బయోటెక్‌(రూ.400 కోట్లు)లు కూడా ఇదే నెలలోనే ఇష్యూకు రానున్నాయి. ఈ అయిదు కంపెనీలు రూ.8,300 కోట్లు సమీకరించేందుకు సిద్ధమయ్ఆయయి. ఇందులో కృష్ణ డయాగ్నోస్టిక్స్‌ ఐపీఓ ఆగస్టు 4న మొదలై 6న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.933-954గా నిర్ణయించింది.