For Money

Business News

చలామణిలోకి కొత్త నాణేలు

కేంద్ర ఆర్థిక శాఖ ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వమిస్తోంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ అయిదు డినామినేషన్లలో నాణేలను విడుదల చేశారు. ఇవాళ విడుదల చేసిన రూ. 1, రూ.2, రూ. 5, రూ. 10, రూ.20 నాణేలపై ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం నినాదం ఉంటుంది. త్వరలోనే ఈ నాణేలు మార్కెట్‌లో చలామణిలోకి రానున్నాయి. దేశాభివృద్ధి కోసం ప్రజల మరింత కృషి చేసేలా ఈ నాణేలు చైతన్యపరుస్తామయని ప్రధాని మోడీ అన్నారు. ఇదే సందర్భంగా జన్‌ సమృద్ధి పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. కేంద్రానికి సంబంధించిన 12 స్కీముల వివరాలు ఈ పోర్టల్‌లో ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.